SCIENTISTS
Friday, 27 January 2012
SCIENTISTS
నీల్స్ బోర్
నీల్స్ బోర్ 1885 అక్టోబర్ 7న క్రిష్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెర్ బోర్
దంపతులకు
డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జన్మించాడు. 1903లో గణితం, వేదాంతం అభ్యసించడానికి కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. తర్వాత వేదాంతానికి బదులు భౌతికశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాడు. 1911లో డాక్టరేట్ పట్టా పొందాడు. 'జె.జె. థామ్సన్ వద్ద చేరి పరిశోధనలు చేశాడు. తర్వాత మాంచెస్టెర్ విశ్వవిద్యాలయంలో 'ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ వద్ద పనిచేస్తూ పరిశోధనలు కొనసాగించాడు. |
ప్రతిపాదించాడు. దీన్ని వివరించడానికి మొదటిసారిగా 'క్వాంటం సిద్ధాంతాన్ని'
ఉపయోగించాడు. 1918లో సైద్ధాంతిక భౌతికశాస్త్ర పరిశోధనశాలకు అధిపతి
అయ్యాడు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 'లాస్ అలమోస్' పరిశోధనశాలలో అణుబాంబు
నిర్మాణానికి ఇతర శాస్త్రజ్ఞులతో పాటు పరిశోధనలు చేశాడు. యుద్ధానంతరం
కోపెన్హాగన్కి తిరిగొచ్చిన నీల్స్ బోర్ కేంద్రకశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంపై
ప్రచారం చేశాడు. CERN అనే ప్రయోగశాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర
వహించాడు.
బోర్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణానికి 1922లో భౌతికశాస్త్ర విభాగంలో
నోబెల్ బహుమతి వచ్చింది. డేనిష్ ప్రభుత్వం 'ది ఆర్డర్ ఆఫ్ ది ఎలిఫెంట్' పురస్కారంతో
గౌరవించింది. 1929లో ఫ్రాంక్లిన్ పతకాన్ని పొందాడు. 1997లో డేనిష్ జాతీయ బ్యాంక్
బోర్ చిత్రమున్న 500 క్రోనే కరెన్సీ నోటును విడుదల చేసింది. 1962 నవంబరు 18న
కోపెన్హాగన్లో నీల్స్ బోర్ మరణించాడు.
____________________________________________________
|
సమయాల్లో రైలు పెట్టెలోనే ప్రయోగాలు చేసేవాడు. ఈయన చేసిన ఓ ప్రయోగం
వల్ల ఓ రైలు బోగీ ప్రమాదానికి గురికావడంతో తన ఉద్యోగం పోగొట్టుకున్నారు.
క్వాడ్రుప్లెక్స్ టెలిగ్రాఫ్ కనుక్కుని, దాని మేథోహక్కులను 1874లో వెస్ట్రన్
యూనియన్ సంస్థకు విక్రయించారు. వచ్చిన డబ్బుతో న్యూజెర్సీలోని
మెన్లో పార్కులో ఓ పారిశ్రామిక పరిశోధనాశాల ప్రారంభించారు. 1877లో
గ్రామఫోన్(ఫోనోగ్రాఫ్), అతి చవకయిన ఫిలమెంటు విద్యుద్దీపంకనుక్కున్నారు.
1877 - 78లో టెలిఫోన్లలో ఉపయోగించే కార్బన్ మైక్రోఫోన్, X - కిరణాలతో
ఫొటోలు తీసే ఫ్లోరోస్కోప్ అనే పరికరం కనుక్కున్నారు. 1891లో కైనెటోస్కోప్
అనే పరికరం ఆవిష్కరించారు. 1912లో మొదటిసారిగా మూకీ చిత్రాల
స్థానే టాకీ చిత్రాలు నిర్మించారు. ఈయన ఉష్ణ అయానిక ఉద్గారం
కనుక్కున్నారు. దానికి 'ఎడిసన్ ఫలితం' అని పేరు. ఈయన తన
జీవితకాలంలో 1093 పరిశోధనలకు పేటెంట్ హక్కులు పొందారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ ఈయన పుట్టిన తేది
ఫిబ్రవరి 11ని జాతీయ పరిశోధకుల రోజుగా ప్రకటించింది. ఈయన 1931
అక్టోబరు 18న, తన 84వ ఏట న్యూజెర్సీలోని వెస్ట్ ఆరెంజ్లో మృతి చెందారు.
______________________________________________
నికోలా టెస్లా
నికోలా టెస్లా 1856 జులై 10 న క్రోయేషియాలోని
స్మిల్జాన్లో జన్మించారు. డ్యూకా, మిలుటిన్ టెస్లా ఆయన తల్లిదండ్రులు. కార్లోవాక్లోని హయ్యర్ రియల్ జిమ్నా జియంలో టెస్లా విద్యాభ్యాసం చేశారు. 1875 లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివేందుకు గ్రాజ్లోని ఆస్ట్రియన్ పాలిటెక్నిక్లో చేరారు. తర్వాత ఛార్లెస్ ఫెర్డినాండ్ యూనివర్సిటీలోనూ ఆయన విద్యాభ్యాసం సాగింది. టెస్లా 1880లో బుడాపెస్ట్లోని ఓ టెలిగ్రాఫ్ కంపెనీలో ఇంజినీర్గా చేరారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే 'టెలిఫోన్ రిపీటర్' అనే పరికరం తయారుచేశారు. |
చేశారు. 1884లో న్యూయార్క్ పట్టణం చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాత
శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర పనిచేయడం ఆయన
శాస్త్ర జీవితంలో ఓ మలుపుగా చెప్పాలి. ఎన్నో వినూత్న పరికరాలకు
టెస్లా ఇక్కడే రూపకల్పన చేశారు. 1886లో సొంతంగా టెస్లా
ఎలక్ట్రిక్ లైట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రారంభించి
సరికొత్త పరికరాలు ఆవిష్కరించారు.
ప్రధాన ఆవిష్కరణ: రేడియో, టీవీల్లో ఉపయోగించే హై ఫ్రీక్వెన్సీ
ఇండక్షన్ వేష్టణం (టెస్లా వేష్టణం) రూపొందించారు. భ్రమణం చెందే
అయస్కాంత క్షేత్రాల ఆధారంగా పనిచేసే పరికరాలెన్నో ఆయన
సృష్టించారు. ఇండక్షన్ మోటార్, వైర్లెస్ సాంకేతికత, టెస్లా విద్యుత్తు
కారు, పాలిఫేజ్ సిస్టం ఆఫ్ a.c. పవర్ లాంటివి కనుక్కున్నారు.
అవార్డులు: 1893లో ఇలియట్ క్రెసన్ పతకం, 1916లో ఎడిసన్
పతకం, 1934లో జాన్ స్కాట్ పతకాలు టెస్లా అందుకున్నారు.
ఆయన గౌరవార్థం శాస్త్రవేత్తలు 'టెస్లా'ని అయస్కాంత క్షేత్రప్రేరణకు
S.I. ప్రమాణంగా ప్రతిపాదించారు. నికోలా టెస్లా 1943 జనవరి 7న
న్యూయార్క్ నగరంలో తన 86వ ఏట మరణించారు.
______________________________________________
మైఖేల్ ఫారడ
మైఖేల్ ఫారడే 1791 సెప్టెంబరు 22 న
ఇంగ్లండ్లోని న్యూఇంగ్టన్లో ఓ పేద కుటుంబంలో పుట్టారు. తండ్రి జేమ్స్ కమ్మరి పనిచేసేవారు. ఫారడే కేవలం ప్రాథమిక విద్య మాత్రమే చదివారు. చిన్నప్పుడే పుస్తకాలు బైండ్ చేసే షాపులో పనికి కుదరడం వల్ల ఆ షాపులోని ఎన్నో పుస్తకాలు చదివే అవకాశం ఆయనకు లభించింది. ఆ పుస్తకపఠనమే విజ్ఞానశాస్త్రంపై ఆయనకు ఎనలేని అభిరుచిని కలిగించింది. |
కార్యదర్శిగా, రాయల్ ఇన్స్టిట్యూట్ రసాయనశాలలో
సహాయకుడిగా నియమితులయ్యారు. సర్ హంఫ్రీడేవి విదేశీ
పర్యటల్లో ఫారడే తోడుగా వెళ్లేవారు. విజ్ఞానశాస్త్రానికి సంబంధించి
ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఈ పర్యటనలు ఎంతో
దోహదపడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్తలతో ఆయనకు పరిచయాలు
ఏర్పడ్డాయి ఫారడే 1824లో రాయల్ సొసైటీ సభ్యుడిగా
ఎంపికయ్యారు. రాయల్ ఇన్స్టిట్యూషన్లో తొలి పుల్లేరియన్
రసాయనశాస్త్ర ఆచార్యుడిగా నియమితులయ్యారు. ఐరోపాలోని
ప్రముఖ సైన్స్ అకాడమీలు కూడా ఆయన్ని తమ సభ్యుడిగా ఎంపిక
చేశాయి.
ప్రధాన ఆవిష్కరణ: ఫారడే విద్యుచ్ఛక్తి మీద ప్రయోగాలు చేశారు.
విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలు ప్రతిపాదించారు. ఎన్నో
ప్రయోగాల ద్వారా విద్యుత్తు విశ్లేషణ నియమాలు ప్రకటించారు.
డయా అయస్కాంత తత్వాన్ని కూడా కనుక్కున్నారు. ధృవణం
చెందిన కాంతిని భ్రమణం చెందించగల 'రొటేటర్' పరికరాన్ని ఫారడే
ఆవిష్కరించారు. ఆయన ప్రతిపాదించిన నియమాలు, సూత్రాలు
విద్యుత్తు మోటార్, డైనమో రూపొందించేందుకు దోహదపడ్డాయి.
అవార్డులు: 'నైట్హుడ్' తో సహా ఫారడేకు ఇంగ్లండ్ ప్రభుత్వం
ఇవ్వజూపిన ఎన్నో పురస్కారాలను ఆయన వినమ్రంగా
తిరస్కరించారు. ఆయన గౌరవార్థం విద్యుత్ కెపాసిటన్స్ S.I.
ప్రమాణంగా ఫారడేని ప్రతిపాదించారు. బ్రిటిష్ మహారాణి
ఆయనకు హంప్టన్ కోర్టు సముదాయంలోని ఓ భవంతి
కూడా బహుకరించారు. ఫారడే ఈ భవంతిలోనే
1867 ఆగస్టు 25న కన్నుమూశారు.
________________________________________________
సర్ ఐజక్ న్యూటన్
సర్ ఐజక్ న్యూటన్ 1642 డిసెంబరు 25న ఇంగ్లండ్ లింకన్ షైర్లోని ఊల్స్థాపేలో జన్మించారు. గ్రాంథమ్లోని కింగ్స్ పాఠశాలలో చదువుకున్నారు. 1661 జూన్లో కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో చేరి.. 1665 ఆగస్టులో పట్టభద్రుడిగా బయటకు వచ్చారు. 1669 లో గణిత శాస్త్ర ఆచార్యుడిగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నియమితులయ్యారు. జీవితం: యాంత్రిక శాస్త్రం, కలన గణితాన్ని న్యూటన్ అభివృద్ధి చేశారు. |
పరిశోధనలు చేశారు. గాజుపట్టకం తెల్లటి కాంతి కిరణాన్ని
ఏడు రంగుల కాంతి కిరణాలుగా విడగొడుతుందని చూపారు.
వస్తుకటకం బదులుగా దర్పణం ఉపయోగించి న్యూటోనియన్
టెలిస్కోపు తయారుచేశారు. కాంతి కణ సిద్ధాంతం ప్రతిపాదించి,
కాంతి లక్షణాలు వివరించారు. జులై 5, 1687లో ఆయన రాసిన
''ప్రిన్సిపియా'' అనే పుస్తకాన్ని ముద్రించారు. ఆ పుస్తకంలోనే
మూడు గతి నియమాలు వివరించారు. విశ్వగురుత్వ సిద్ధాంతం
ప్రతిపాదించి, గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగడానికి కారణం
వాటి మధ్య ఉన్న గురుత్వాకర్షణే అని తెలిపారు.
1689 - 1690లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1696లో ప్రభుత్వ టంకశాలకు అధిపతిగా నియమితులయ్యారు.
1705లో ఇంగ్లండ్ మహారాణి నుంచి 'నైట్ హుడ్' బిరుదు పొందారు.
వెస్ట్ మినిస్టర్ అభేలో న్యూటన్ స్మారక చిహ్నాన్ని చూడవచ్చు.
1978 నుంచి 1988 వరకూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ న్యూటన్ చిత్రంతో
ఉన్న కరెన్సీ నోట్లు విడుదలజేసింది. 1727 మార్చి 31న
ఇంగ్లండ్లోని కెన్సింగ్టన్లో కన్నుమూశారు.
____________________________________________
|
||||||||
______________________________________________________________ |
|
||||||||
జొహెనెస్ కెప్లర్
ఉపాధ్యాయుడిగా చేరారు. తర్వాత టుబిన్జెన్ విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేశారు. ఖగోళ, జ్యోతిష, గణిత, తత్వ శాస్త్రాలపై అధ్యయనం చేశారు. గ్రహాల కొత్త కక్ష్యల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త టైకోబ్రా కెప్లర్ని తన సహాయకుడిగా నియమించుకున్నాడు. టైకోబ్రా మరణాంతరం ఇంపీరియల్ గణిత శాస్త్రవేత్తగా కెప్లర్ పదవిని పొందారు. గణన చేయడానికి సంవర్గమానాలను ఏవిధంగా ఉపయోగించవచ్చో వివరించారు. గ్రహగతులకు సంబంధించి మూడు నియమాలు ప్రతిపాదించారు. కోపర్నికస్ తెలియజేసిన విషయాలను మెరుగుపరిచి వాటిని అభివృద్ధి చేశారు. కెప్లర్ గతి నియమాలు, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడ్డాయి. 1630లో నవంబరు 15న తన 58వ ఏట జర్మనీలోని రెజెన్స్బెర్గ్లో మరణించారు. | ||||||||||||||||||||||||||||||||||
|
1 comment:
తెలుగు లో చాలా మంచి వ్యాసాలు అందిస్తున్నందుకు ధన్యవాదములు . నేను మీ బ్లాగులో కొంత సంచారమును తెలుగు వికిపీడియాలో రాసాను , దయచేసి మీరు కూడా మరికొంత సమాచారం చేర్చ గలరు
కశ్యప్
93936533366
Post a Comment